Skip to main content

SRI RAMA NAVAMI CHARITRA IN TELUGU | For Endowment Jobs

 


శ్రీ రామ నవమి చరిత్ర

SRI RAMA NAVAMI CHARITRA IN TELUGU


ప్రాముఖ్యత : రాముడి పుట్టినరోజు, రామాసీతా పెళ్లిరోజు

ముగింపు : చైత్ర నవమి, చైత్ర మాసంలోని 9వ రోజు

ఉత్సవాలు : 1 - 10 రోజులు

ఆవృత్తి : సంవత్సరం

శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు. ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి ( మహారాష్ట్రలో ), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో ) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు (క్రీ.పూ) శాలివాహన శకం 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.


➡️ బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.


➡️ ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.


➡️ ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.).

దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు. ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది.

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు. "ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు."ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా " Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది.  

కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది.

NOTE : ‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు,

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.

NOTE: దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది.

జై శ్రీ రామ్

LATEST GOVERNMENT JOBS DAILY UPDATES HERE

Comments

Popular posts from this blog

How did autumn begin? | శరదృతువు ఎలా ప్రారంభమైంది ? | Latest Jobs Articles

 శరదృతువు ఎలా ప్రారంభమైంది ? ( How did autumn begin? ) రాజహంసలు పొందిన క్రౌంచపర్వత బిలము గలదై , వరిచేను మరియు గడ్డి సమూహముల పుట్టుకకు కారణము గలదై , యాజ్ఞికులచే చేయబడిన హోమ హవిస్సుతో కూడిన అగ్ని కలిగినదై బాగా ప్రకాశించెడి లక్షీదేవి చేరిన కమలముగలదై మెలకువతో ఉన్న ఆది శేషునిపై పడుకున్న శ్రీమహా విష్ణువు సేవ కొఱకే అన్నట్లుగా వికసించిన ఎఱ్ఱ కలువలతో నిండిన సరస్సుగలదై శరధృతువు ప్రారంభమైనది.  శరదృతువులో ప్రకృతి ఎలా కన్పడింది ? ( What did nature look like in the fall?) శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి ? - శరత్కాలమనెడి స్త్రీ ఈ భూమికి ( దేవలోకం వలె ) అమృత సమానత్వాన్ని చేకూర్చుటకై, వర్షాకాలపు మబ్బులు వీడిన తర్వాత ఎక్కువగా కాసె ఎండును ; వికసించిన తెల్లతామరల, ఎర్రకలువల యొక్క పుప్పొడిని చెఱువులలోని అలలపై కలుగజేస్తూ అచటి నీటి కాలుష్యాన్ని పోగొట్టుచున్నదా ?  అన్నట్లు అందాన్ని చూకూరుస్తుందని కవి వర్ణిస్తాడు . How are the autumn clouds?        The woman of autumn dries up most of the case after the monsoon clouds have parted, in order to add ambrosial equali...

Information and analysis of ancestral traits | పూర్వీకుల లక్షణాల సమాచారం మరియు విశ్లేషణ

 Information and analysis of ancestral traits ( పూర్వీకుల లక్షణాల సమాచారం మరియు విశ్లేషణలు) మీరు .. మీ నాన్న గారు .. మీ తాత గారు .. ముత్తాత గారు .ఇక్కడి  దాకా ఓకే  కానీ....... ఇంకా ముందున్న పూర్వీకులు గురించి మీకు తెలుసా ? పోనీ మీకు ఎంత మంది పూర్వీకులు వున్నారో తెలుసా? భూమి పై మనిషి పుట్టి నలబై లక్షల సంవత్సరాలు అయ్యింది . వందేళ్లకు మూడు తరాలు. అంటే మీకు ఒక కోటి ఇరవై లక్షల మంది  పూర్వీకులు వున్నారు .. ముత్తాత కు నాన్న .. ముత్తాత కు తాత .. ముత్తాతకు ముత్తాత .. ఇలా వెనక్కు వెళితే మొత్తం కోటి ఇరవై లక్షల తరాల చరిత్ర మీది .. నాది .. మనందరిది .  మనిషి అయిదు వేల సంవత్సరాల క్రితం దాక అడవిలోనే నివసించాడు . అంటే మీ పూర్వీకుల్లో  ఒక కోటి పందొమ్మిది లక్షల ఎనబై అయిదు వేల మంది బతికింది అడవుల్లోనే. చివరి పదహైదు వేల  తరాల వారు మాత్రమే గుడిసెలు వేసుకొని స్థిరనివాసం ఏర్పరచుకొని గ్రామాల్లో బతికారు .      అడవి లో  జీవనం అంటే చెట్లు చేమలు .. జంతువుల తో  సావాసం .. ఆ మాటకు వస్తే గుడిసెల్లో గ్రామీణ జీవనం కూడా ప్రకృతి లో జీవించడమే కదా?  . చెట్...

KURNOOL DISTRICT BACKLOG POSTS NOTIFICATION 2021 - Latest

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వము విభిన్న ప్రతిభావంతుల ( వికలాంగుల ) బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటన KURNOOL DISTRICT BACKLOG POSTS NOTIFICATION 2021 - LATEST Eligible candidates from Kurnool district are invited to apply online for the following posts reserved for the following categories:  Must be submitted to the Assistant Directors, Diverse Talents, Hijra and Elderly Welfare Department, Collector Complex, Kurnool within 5.00 hrs (during office working days) వివిధ శాఖలలోని విభిన్న ప్రతిభావంతుల ( వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి కర్నూలు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన బ్యాక్ గ్ పోస్టులకై ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు అహ్వానించడమైనది . ధరఖాస్తులు స్వీకరించు తేది : 29.12.2021 నుండి 07 పనిదినాలు అనగా చివరి తేది : 04.01.2022 సాయంత్రం 5.00 గంటలలోపు ( కార్యాలయపు పని దినములలో ) సహాయ సంచాలకులు , విభిన్న ప్రతిభావంతులు , హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ , కలెక్టర్ కాంప్లెక్స్ , కర్నూలునకు సమర్పించవలెయును డి .యస్.సి....